జమ్మికుంట (20 జూలై 2026): స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఖాళీగా ఉన్న 4 అతిథి అధ్యాపక (గెస్ట్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కళాశాలలో తెలుగు-1, కామర్స్-1, డైరీ సైన్స్-1, క్రాప్ ప్రొడక్షన్-1 చొప్పున మొత్తం నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కమీషనర్ ప్రొసీడింగ్స్ నిబంధనల ప్రకారం.. […]
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో రాష్ట్ర డీజీపీ డి.ఎస్. చౌహాన్ ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సప్తగిరి రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆర్వీఈఓ బస్వరెడ్డి, డీఎస్పీ సీతారెడ్డి, ఎమ్మార్వో దినేష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ అనిల్ ప్రశాంత్, డీఈ విజయశేఖర్, ఏసీ సురేష్, ఎస్సై రాజేష్, ఏఎస్ఐ ప్రవళికతో పాటు విజిలెన్స్, సివిల్ సప్లైస్ సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యం, […]
జమ్మికుంట, జూలై 15, 2026: స్థానిక ఎంప్లాయీస్ కాలనీలో ఓ సమస్యకు తక్షణమే స్పందించిన యువ నాయకులు దౌలత్ పాషా, సందీప్ సామాజిక బాధ్యతను చాటుకుని స్థానికులకు ఆదర్శంగా నిలిచారు. వాట్సాప్ గ్రూప్ మెసేజ్తో తక్షణ స్పందనకాలనీలోని పది పోర్షన్ల వెనుక వీధి మధ్యలో రాత్రి 8 గంటల సమయంలో ఓ కుక్క మృతి చెందింది. దారి మధ్యలో కళేబరం పడి ఉండటంతో ఆ దారిన వెళ్లే ప్రజలు, ముఖ్యంగా చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. […]
జమ్మికుంట, జూలై 1: జమ్మికుంట పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన లెంకలపల్లి శరత్ కుమార్కు స్థానిక గాండ్ల కుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. గాండ్ల కుల సంఘం తరపున నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శరత్ కుమార్ను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో గాండ్ల కుల గౌరవ అధ్యక్షుడు వెన్నంపల్లి విఠల్ దాస్, మండల అధ్యక్షుడు పోతునూరి శ్రీశైలం పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షుడు […]
జమ్మికుంట మండల మాజీ బీజేపీ అధ్యక్షుడు, స్వర్గీయ పోల్నెని రవీందర్ రావు గారి వర్ధంతి సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు.రామమందిర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనను పార్టీకి రాజీనామా చేయాలంటూ 1997 జూన్ 15న నక్సలైట్లు దారుణంగా హత్య చేశారు.వారి ప్రాణ త్యాగాల పునాదులపైనే నేడు బీజేపీ అధికారంలో ఉందని కౌన్సిలర్ శీలం శ్రీనివాస్ తదితరులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.
జమ్మికుంట, మార్చి 24, 2026: తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్వీ టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, 250 గజాల ఇంటి స్థలం, రూ. 25,000 పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.వీటి సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే, రాత్రికి రాత్రే పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. నాడు ఉద్యమకారులు ప్రాణాలకు తెగించి కొట్లాడితే వచ్చిన తెలంగాణలో, […]
మార్చి 24: ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ను ఆలయ చైర్మన్ ఇంగ్లే రామారావు, ధర్మకర్తలు ఆహ్వానించారు. ఆయనకు ఆహ్వాన పత్రికతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. ఉత్సవాలకు వచ్చే భక్తులకు మున్సిపాలిటీ తరపున పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు కల్పిస్తామని, రాజకీయాలకు అతీతంగా పాలకవర్గం అన్నివిధాలా సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ తదితరులు పాల్గొన్నారు.
మార్చి 24: ఈ నెల 27న జరగనున్న ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందంను ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు, ధర్మకర్తలు ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
హుజురాబాద్, మార్చి 23: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) హుజురాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా జమ్మికుంటకు చెందిన డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) నియమితులయ్యారు. హుజురాబాద్లో జరిగిన సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ ఈ మేరకు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. పలువురు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ప్రభాకర్కు శుభాకాంక్షలు తెలిపారు.
మార్చి 8, 2026: పెంచిన వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట గాంధీ చౌక్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో వినూత్న నిరసన చేపట్టారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొప్పుల శంకర్ మాట్లాడుతూ, క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. గృహ వినియోగ సిలిండర్పై రూ.60, కమర్షియల్పై రూ.115 పెంచడం దారుణమన్నారు. మహిళా దినోత్సవం ముందు ధరలు పెంచి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు. గ్యాస్ […]