మార్చి 24: ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ను ఆలయ చైర్మన్ ఇంగ్లే రామారావు, ధర్మకర్తలు ఆహ్వానించారు. ఆయనకు ఆహ్వాన పత్రికతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. ఉత్సవాలకు వచ్చే భక్తులకు మున్సిపాలిటీ తరపున పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు కల్పిస్తామని, రాజకీయాలకు అతీతంగా పాలకవర్గం అన్నివిధాలా సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ తదితరులు పాల్గొన్నారు.
మార్చి 24: ఈ నెల 27న జరగనున్న ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందంను ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు, ధర్మకర్తలు ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
హుజురాబాద్, మార్చి 23: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) హుజురాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా జమ్మికుంటకు చెందిన డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) నియమితులయ్యారు. హుజురాబాద్లో జరిగిన సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ ఈ మేరకు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. పలువురు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ప్రభాకర్కు శుభాకాంక్షలు తెలిపారు.
మార్చి 8, 2026: జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో డిస్ట్రిక్ట్ ఇమ్మనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సాజిదా అతారి, సూపరిండెంట్ డాక్టర్ బి రమేష్ తో కలిసి హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భాశయ, యోని, గొంతు క్యాన్సర్లు, జననేంద్రియ మొటిమల నుంచి రక్షణ కల్పించే ప్రాథమిక నివారణ మందే ఈ వ్యాక్సిన్ అని వారు వివరించారు. ఇది 100% సురక్షితమని పేర్కొంటూ, వ్యాక్సిన్ వేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. రానున్న మూడు నెలల పాటు ప్రతిరోజూ ఉదయం […]
హైదరాబాద్ – రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ముఖ్యమైన తేదీలు ఓటర్ల వివరాలు ఈ ఎన్నికల్లో మొత్తంగా 52.43 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
తమ పనిమీద జమ్మికుంటలోని కాకతీయ డిజి స్కూల్ వద్ద వెళ్తున్న మాచనపల్లి గ్రామానికి చెందిన కనవేనా తిరుపతి (32), కనవేనా ప్రశాంత్ (27)లకు ఒక పుస్తెలతాడు కనిపించింది. వెంటనే వారు దానిని జమ్మికుంట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ విచారించి, అది మల్యాలకు చెందిన నేరెళ్ల స్రవంతి (25)దిగా గుర్తించి ఆమెకు తిరిగి ఇచ్చారు. బాధ్యతాయుతంగా వ్యవహరించిన తిరుపతి, ప్రశాంత్లను ఇన్స్పెక్టర్ అభినందించారు.
అక్టోబర్ 26, 2025జమ్మికుంట పట్టణ ప్రజలకు శుభవార్త. ప్రముఖ ఆన్లైన్ బైక్ ట్యాక్సీ సేవ ‘రాపిడో’ (Rapido) ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. స్థానిక ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి, తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ సేవ ప్రారంభించబడింది. పట్టణంలో ఎక్కడికైనా త్వరగా చేరుకోవడానికి ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
అర్హతలు:- 1. సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి కచ్చితంగా గ్రామపంచాయతీలో స్థానికుడై ఉండాలి. 2. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి. 3. సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 4. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది. 5. మహిళలకు […]
జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామానికి చెందిన రాసపల్లి శ్రావణ్కుమార్ ప్రమాదవశాత్తూ మైనింగ్ యాక్సిడెంట్లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు స్మారకార్థం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం రాచపల్లి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక స్పందన అనాధాశ్రమం లోని పిల్లలకు బ్రెడ్, అరటిపండ్లు, కారా వంటి ఆహారపదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ – “శ్రావణ్కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన స్మృతిని ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాల రూపంలో […]
భాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం ఆబాది జమ్మికుంట కు చెందిన మాగంటి శ్రీనివాస్ అనే గ్రామీణ వైద్యుడు గుండె పోటుతో మరణించడంతో ఆ కుటుంబానికి గ్రామీణ వైద్యుల మిత్ర బృందం పది వేల ఆర్థిక సహాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు.