జమ్మికుంట, మార్చి 24, 2026: తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్వీ టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, 250 గజాల ఇంటి స్థలం, రూ. 25,000 పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.వీటి సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే, రాత్రికి రాత్రే పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. నాడు ఉద్యమకారులు ప్రాణాలకు తెగించి కొట్లాడితే వచ్చిన తెలంగాణలో, […]
మార్చి 24: ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ను ఆలయ చైర్మన్ ఇంగ్లే రామారావు, ధర్మకర్తలు ఆహ్వానించారు. ఆయనకు ఆహ్వాన పత్రికతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. ఉత్సవాలకు వచ్చే భక్తులకు మున్సిపాలిటీ తరపున పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు కల్పిస్తామని, రాజకీయాలకు అతీతంగా పాలకవర్గం అన్నివిధాలా సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ తదితరులు పాల్గొన్నారు.
మార్చి 24: ఈ నెల 27న జరగనున్న ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందంను ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు, ధర్మకర్తలు ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
హుజురాబాద్, మార్చి 23: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) హుజురాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా జమ్మికుంటకు చెందిన డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) నియమితులయ్యారు. హుజురాబాద్లో జరిగిన సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ ఈ మేరకు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. పలువురు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ప్రభాకర్కు శుభాకాంక్షలు తెలిపారు.
మార్చి 8, 2026: పెంచిన వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట గాంధీ చౌక్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో వినూత్న నిరసన చేపట్టారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొప్పుల శంకర్ మాట్లాడుతూ, క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. గృహ వినియోగ సిలిండర్పై రూ.60, కమర్షియల్పై రూ.115 పెంచడం దారుణమన్నారు. మహిళా దినోత్సవం ముందు ధరలు పెంచి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు. గ్యాస్ […]
మార్చి 8, 2026: జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో డిస్ట్రిక్ట్ ఇమ్మనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సాజిదా అతారి, సూపరిండెంట్ డాక్టర్ బి రమేష్ తో కలిసి హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భాశయ, యోని, గొంతు క్యాన్సర్లు, జననేంద్రియ మొటిమల నుంచి రక్షణ కల్పించే ప్రాథమిక నివారణ మందే ఈ వ్యాక్సిన్ అని వారు వివరించారు. ఇది 100% సురక్షితమని పేర్కొంటూ, వ్యాక్సిన్ వేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. రానున్న మూడు నెలల పాటు ప్రతిరోజూ ఉదయం […]
జమ్మికుంట: అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఒక యువ న్యాయవాదికి ఆలయ ఫౌండేషన్ మానవత్వంతో అండగా నిలిచింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామానికి చెందిన యువ న్యాయవాది వీరవేన కుమార్ గత కొంతకాలంగా అనారోగ్య కారణాల వల్ల రెండు కాళ్లు పక్షవాతానికి గురై ఇంటికే పరిమితమయ్యారు.వృత్తి రీత్యా న్యాయవాది అయినప్పటికీ, శారీరక ఇబ్బందులు మరియు ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న కుమార్, ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణ సాగర్ను సంప్రదించారు. ఈ విషయాన్ని ఫౌండేషన్ మార్గదర్శకులు, […]
జమ్మికుంట: పట్టణంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మొహమ్మద్ దౌలత్ పాషా ఆధ్వర్యంలో పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సజ్జాద్ మొహమ్మద్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అఖిలభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అతి చిన్న వయసులో బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో స్వాతంత్ర ఉద్యమాన్ని […]
జమ్మికుంట: తెలంగాణ అయ్యప్ప సేవర్థి ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షులు సిరిమల్లె జయేందర్ గురు స్వామి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు వాకాటి భాస్కరరావు జయేందర్ సేవలను గుర్తించి ఉపాధ్యక్షులుగా నియమించినారు 2026-2028 రెండు సంవత్సరాల కాలానికి గాను రెండవసారి ఉపాధ్యక్ష పదవి వరించడం పట్ల జమ్మికుంట అయ్యప్ప స్వాములు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం అయ్యప్ప దేవాలయంలో స్వామి ఎదుట ప్రమాణ స్వీకారం […]
హైదరాబాద్ – రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ముఖ్యమైన తేదీలు ఓటర్ల వివరాలు ఈ ఎన్నికల్లో మొత్తంగా 52.43 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.