జమ్మికుంట ఆబాదిలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ తాటిపాముల భావన రుషి గారు కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మృతి చెందారు.
వారి మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, శిష్యులు, ఉపాధ్యాయులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భావన రుషి గారి సేవలను పలువురు స్మరించుకున్నారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జమ్మికుంట ఎంప్లాయీస్ కాలనీలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.








