రైస్ మిల్ కార్మికులకు రూ. 26,000 కనీస వేతనం ఇవ్వాలి

జమ్మికుంట: రైస్ మిల్ ఆపరేటర్లకు కనీస వేతనంగా రూ. 26,000 చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సదుపాయాలను హమాలీ, వాచ్‌మెన్ వంటి అన్ని రకాల కార్మికులకు అమలు చేయాలని ఆయన కోరారు.
యజమాన్యాలు కనీస వేతనంపై కాకుండా ఇష్టానుసారం పీఎఫ్ చెల్లిస్తున్నాయని, పాత కార్మికులకు భద్రత లేకుండా చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. బీహార్ వలస కార్మికుల చట్టాన్ని కఠినంగా అమలు చేసి, వారి శ్రమ దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేపడతామని తెలిపారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos