జమ్మికుంట ఆసుపత్రిలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ: సిబ్బందికి కీలక హెచ్చరిక

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ వెంకట రమణ శనివారం సాయంత్రం జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (ప్రభుత్వ ఆసుపత్రిని) ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను మెరుగుపరిచేందుకు ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు.
తనిఖీలో భాగంగా, డాక్టర్ వెంకట రమణ లేబర్ రూమ్, వార్డులు, సోనోగ్రఫీ రూమ్, మరియు ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆదేశాలు:
* ప్రతి గర్భిణీకి మెరుగైన వైద్యం అందించాలి.
* ఆసుపత్రిలోనే స్కానింగ్, ఎక్స్-రే సేవలు అందించాలి, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి.
* ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందాలి.
* సిబ్బంది సమయపాలన తప్పక పాటించాలి.
విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన సిబ్బందిని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పీఓడీటీ డాక్టర్ ఉమా రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చందు, పీఓఎంసీహెచ్ డాక్టర్ సనా జవేరియా తదితర అధికారులు పాల్గొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos