Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.
జమ్మికుంట పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ఆవరణలో శ్రీ గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం ఘనంగా మొదలయ్యాయి. బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి పర్యవేక్షణలో అర్చక బృందం వేదమంత్రాల మధ్య సుప్రభాతం, గోపూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ సహా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చిట్టోజు రజిత శ్రీనివాస్ దంపతులు మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకార రమేష్, జూపాక శ్రీనివాస్, సూరాచారిలతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం […]
స్థానిక జమ్మికుంట గాంధీ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణ, మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి, టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేసి, ప్రస్తుతం 6 గ్యారంటీలను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మరింత […]
జమ్మికుంట: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం, పాలకవర్గం కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడర్స్, ఆర్థిదారులు, రైతులు, హమాలీలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జమ్మికుంట: జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అదృశ్యం కావడంతో కేసు నమోదైంది. మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల పోచయ్య అనే వ్యక్తి తన కూతురు అంబాల నిర్మల (భర్త రాజు, వయసు 32) కనిపించడం లేదంటూ పోలీస్లకు ఫిర్యాదు చేశారు. 🔍 కేసు వివరాలుపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: 🚨 పోలీసుల స్పందనతండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.జమ్మికుంట CI రామకృష్ణ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. మహిళ ఆచూకీ […]
నవంబర్ 05, 2025జమ్మికుంట: కార్తీక పౌర్ణమి సందర్భంగా జమ్మికుంటలోని శ్రీ విశ్వేశ్వర స్వామి (బొమ్మల గుడి) ఆలయం భక్త సంద్రమైంది. భక్తులు స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు, ఉసిరి చెట్టుకు దీపాలు సమర్పించారు. అమ్మవారికి పౌర్ణమి పూజలు, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేణుగోపాల్ శర్మ తీర్థ ప్రసాదాలు అందించగా, అన్నపూర్ణ సేవా సమితి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించింది.
జమ్మికుంట: స్వామి వివేకానంద పాఠశాల హాస్టల్కు చెందిన 9వ తరగతి విద్యార్థులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని అధికారులను కోరినా, వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై BRSV రాష్ట్ర నాయకులు ఆవుల తిరుపతి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాల యజమాన్యం కనీసం స్పందించకపోవడం, అధికార యంత్రాంగం మద్దతుగా నిలవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలలు ధన దాహంతో విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని విస్మరిస్తున్నాయని […]
జమ్మికుంట: హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన న్యాయవాది నుతాల శ్రీనివాస్ను బీజేపీ నాయకులు జమ్మికుంటలోని ఆయన స్వగృహంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడారు. న్యాయ వృత్తిలో పేద, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడే మంచి పేరు శ్రీనివాస్కు ఉందని కొనియాడారు. చదువుకునే రోజుల్లో ఏబీవీపీలో పనిచేసి, బీజేపీ పటిష్టతకు కూడా […]
జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పుట్టినరోజు వేడుకలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సలీం పాషా ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ చౌరస్తాలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు భారీగా బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం, జమ్మికుంట శివాలయంలో మహా అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ […]
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ వెంకట రమణ శనివారం సాయంత్రం జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (ప్రభుత్వ ఆసుపత్రిని) ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను మెరుగుపరిచేందుకు ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు.తనిఖీలో భాగంగా, డాక్టర్ వెంకట రమణ లేబర్ రూమ్, వార్డులు, సోనోగ్రఫీ రూమ్, మరియు ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆదేశాలు: * ప్రతి గర్భిణీకి మెరుగైన వైద్యం అందించాలి. * ఆసుపత్రిలోనే […]
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా): రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తెలంగాణ (STUTS) జమ్మికుంట మండల శాఖకు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులుగా మేడుదుల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ రజాక్ పాషా ఎన్నికయ్యారు.ఈరోజు (తేదీ: అక్టోబరు 31, 2025) ఎంపీయూపీఎస్ ధర్మారం పాఠశాల ఆవరణలో మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల అధికారి రవీంద్ర నాయక్ మరియు సీనియర్ నాయకులు జి. భాస్కర్ రెడ్డి గారి పర్యవేక్షణలో మండల నూతన శాఖ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. […]