Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.
నవంబర్ 17న వైభవంగా కార్తీక దీపోత్సవం జమ్మికుంట పట్టణంలో శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (బొమ్మల గుడి) నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నవంబర్ 17, 2025 సోమవారం సాయంత్రం 6 గంటల నుండి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా శివరామకృష్ణ ఆశ్రమ బృందం, అంజలి డ్యాన్స్ అకాడమీ, శ్రీకృష్ణ అకాడమీచే కూచిపూడి నాట్యం, చక్కభజనతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. హిందూ ధర్మ ప్రచారకులు స్వామి లక్షణాచార్య ప్రవచనం, పురోహితులచే […]
జమ్మికుంట: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టి.పి.టి.ఎఫ్) సీనియర్ నాయకులు కోల రాజమల్లు ఆధ్వర్యంలో జమ్మికుంట మండలంలోని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను సేకరించారు.పెండింగ్లో ఉన్న ఐదు డి.ఏ.లు, నాణ్యమైన పి.ఆర్.సి.ని వెంటనే ప్రకటించాలని ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జి.పి.ఎఫ్., సరెండర్ లీవ్స్, ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఉపాధ్యాయులను బోధనకు అంకితం చేసే విధంగా విధానాలు ఉండాలని, పర్యవేక్షణ పేరుతో ఒత్తిడి పెంచవద్దని […]
జమ్మికుంట: జమ్మికుంట-పెద్దపల్లి ప్రధాన రోడ్డుపై నాగంపేట కూడలి వద్ద ఏర్పడిన గుంతను తనుగుల సెక్షన్ విద్యుత్ ఉద్యోగులు పూడ్చి సామాజిక స్పృహ చాటుకున్నారు. వర్షాలకు ఏర్పడిన ఈ పెద్ద గుంతతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. బేకరీ యజమాని రవి విజ్ఞప్తి మేరకు, బిజిగిరి షరీఫ్ లైన్ మెన్ విజ్జిగిరి అంజయ్య, ఏఎల్ఎం రమేష్ బాబు, సతీష్ సహా ఇతర ఉద్యోగులు లంచ్ సమయంలో కంకర, సిమెంట్తో గుంతను పూడ్చివేశారు. వీరి సేవను స్థానికులు, వాహనదారులు హర్షించారు.
జమ్మికుంట: రైస్ మిల్ ఆపరేటర్లకు కనీస వేతనంగా రూ. 26,000 చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సదుపాయాలను హమాలీ, వాచ్మెన్ వంటి అన్ని రకాల కార్మికులకు అమలు చేయాలని ఆయన కోరారు.యజమాన్యాలు కనీస వేతనంపై కాకుండా ఇష్టానుసారం పీఎఫ్ చెల్లిస్తున్నాయని, పాత కార్మికులకు భద్రత లేకుండా చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. బీహార్ వలస కార్మికుల చట్టాన్ని కఠినంగా అమలు చేసి, వారి శ్రమ దోపిడీని […]
జమ్మికుంట: వరల్డ్ డయాబెటిస్ డే (ప్రపంచ మధుమేహ దినోత్సవం) సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఆధ్వర్యంలో ఈ నెల 14న జమ్మికుంటలో 2కే రన్ నిర్వహించనున్నారు.డయాబెటిస్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. * ఎప్పుడు: నవంబర్ 14న * ఎక్కడ: జమ్మికుంట * రన్ మార్గం: అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రభుత్వ కళాశాల మైదానం వరకు ఈ 2కే రన్ కొనసాగుతుంది. ఈ […]
జమ్మికుంట: మంగళవారం, 11 నవంబర్, 2025 న న్యూ విజన్ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.నూతన కమిటీ అధ్యక్షుడిగా పాస్టర్ జాన్, ఉపాధ్యక్షుడిగా డేవిడ్ పాస్టర్ ఎన్నికయ్యారు. పాస్టర్ జ్యోతి బాబు జనరల్ సెక్రటరీగా, పాస్టర్ సువార్త రాజు జాయింట్ సెక్రటరీగా, పాస్టర్ టైటస్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.పాస్టర్ అశోక్ గౌరవ అధ్యక్షులుగా, పాస్టర్ ప్రసాద్ ముఖ్య సలహాదారులుగా వ్యవహరించనున్నారు. కార్యవర్గ సభ్యులుగా పాస్టర్ సైఫెన్, పాస్టర్ రాజేందర్ ఎన్నికయ్యారు.
జమ్మికుంట మండల కేంద్రంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కోశాధికారి లద్దునురి విష్ణు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.జమ్మికుంట బాలికల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, గురుకుల పాఠశాలలకు, శిథిలావస్థలో […]
జమ్మికుంట: మైనారిటీ వెల్ఫేర్ డే నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా జమ్మికుంట( ఇందిరానగర్)కు చెందిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ 1 పాఠశాలలో మంగళవారం రోజున మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, జన్మదినం రోజును పురస్కరించుకొని నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషనల్ డే ను ఘనంగా ప్రిన్సిపల్ నాధియా ఫర్నాజ్, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య కళలతో ఆటపాటలతో పలువురిని ఆలకించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద […]
జమ్మికుంట: మండలంలోని రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో అన్నదాతలను నిలువునా దోపిడీ చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, మిల్లర్లు ప్రతి క్వింటాల్కు 5 నుండి 8 కిలోలు అదనంగా కాటా వేస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లపై వెంటనే విజిలెన్స్ తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఐకేపీ సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, […]
జమ్మికుంట పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ఆవరణలో శ్రీ గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం ఘనంగా మొదలయ్యాయి. బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి పర్యవేక్షణలో అర్చక బృందం వేదమంత్రాల మధ్య సుప్రభాతం, గోపూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ సహా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చిట్టోజు రజిత శ్రీనివాస్ దంపతులు మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకార రమేష్, జూపాక శ్రీనివాస్, సూరాచారిలతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం […]