Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.
అక్టోబర్ 18, 2025జమ్మికుంట: కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి జమ్మికుంటలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ కిడ్నీ స్పెషలిస్ట్ డా. గీతాంజలి నరేష్ ప్రతి ఆదివారం ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జమ్మికుంట నందు రోగులకు అందుబాటులో ఉంటున్నారు.కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం ఇకపై కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి పెద్ద పట్టణాలకు వెళ్లవలసిన అవసరం లేదని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది. జమ్మికుంటలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని […]
2025 అక్టోబర్ 18కరీంనగర్ జిల్లా, జమ్మికుంట: లెదర్ పార్కులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకురావాలని మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్డి) జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.జమ్మికుంట గాంధీ చౌరస్తాలో లెదర్ పార్క్ సాధన చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలో పాల్గొన్న సందర్భంగా వారు మాట్లాడారు. సుమారు 11 సంవత్సరాల క్రితం చర్మకారుల అభివృద్ధి కోసం ఉమ్మడి […]
జమ్మికుంట, అక్టోబర్ 18 (జమ్మికుంటలోకల్.కామ్): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ, బీసీలను మోసం చేస్తోందని సీపీఎం మండల కార్యదర్శి శీలం అశోక్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, గవర్నర్కు పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకపోవడం సిగ్గుచేటని అన్నారు.42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మోత్కులగూడెం చౌరస్తా నుండి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వరకు బైక్ ర్యాలీ […]
17 అక్టోబర్ 2025బీసీల ఉద్యమాలన్నింటికీ బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది: సింగిల్ విండో చైర్మన్కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్, కొత్తపల్లి మాజీ సర్పంచ్ బొద్దుల రవీందర్, మాజీ ఎంపీటీసీ తోట లక్ష్మణ్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం అమలు కాకుండా జరుగుతున్న కుట్రలకు నిరసనగా బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు (18) జరగబోయే తెలంగాణ బంద్ను పాటించాలని వారు […]
October 16, 2025జమ్మికుంట: పట్టణంలోని 22వ వార్డు అంబేడ్కర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గుల్లి ప్రతాప్ ఆధ్వర్యంలో మల్లయ్య జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ప్రతాప్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనసున్న పొనగంటి మల్లయ్య నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం మల్లయ్యను శాలువాతో సన్మానించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యూత్ సభ్యులు ఇల్లందుల శ్రీనివాస్, శశి కుమార్, రవిబాబు, రాజు, […]
జమ్మికుంట, అక్టోబర్ 15, 2025:స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థులు ‘వెల్కమ్ పార్టీ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కరీంనగర్ జిల్లా డివిజనల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DIEO) గంగాధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.విద్యార్థులను ఉద్దేశించి DIEO గంగాధర్ ప్రసంగిస్తూ… విద్యార్థులు మంచిగా చదువుకొని, కళాశాల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచి, జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. కష్టపడి చదవడం ద్వారానే ఉన్నత ఫలితాలను సాధించవచ్చని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ […]
తేదీ: అక్టోబర్ 14, 2025జమ్మికుంట: రాబోయే ఖరీఫ్ సీజన్కు సంబంధించి పత్తి క్రయవిక్రయాలపై చర్చించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ), జమ్మికుంట ఛైర్పర్సన్ శ్రీమతి పుల్లూరి స్వప్న – సదానందం గారు మరియు పాలకవర్గం అధ్యక్షతన ఈ రోజు (అక్టోబర్ 14, 2025) సాయంత్రం 5:00 గంటలకు కాటన్ మార్కెట్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పత్తి వ్యాపారస్థులు, ట్రేడర్లు, మరియు అర్తి దారులు పాల్గొన్నారు.ఛైర్పర్సన్ మాట్లాడుతూ, రైతులకు న్యాయం జరగాలని, మంచి గిట్టుబాటు ధరలు […]
అక్టోబర్ 14, 2025జమ్మికుంట:రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జమ్మికుంట ఖండం ఆధ్వర్యంలో పట్టణంలో పదసంచలనం (రూట్ మార్చ్) వైభవంగా జరిగింది.శ్రీ సరస్వతి శిశు మందిర్ నుంచి పురవీధుల గుండా స్వయంసేవకులు క్రమశిక్షణతో కూడిన కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ దాసరి రవీందర్, ముఖ్య అతిథి డాక్టర్ ముక్క రాజేశ్వరయ్య, ప్రధాన వక్త దేవుని మురళి సహా దాదాపు 200 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు.ఆర్ఎస్ఎస్ చేపట్టిన ఈ కవాతుకు జమ్మికుంట పట్టణ […]
జమ్మికుంట, అక్టోబర్ 13, 2025:జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం (13-10-2025) పత్తి ధరల వివరాలు ఇలా ఉన్నాయి: * విడి పత్తి (కాటన్): ఈ రోజు మార్కెట్కు 1,408 క్వింటాళ్ల విడి పత్తిని 174 వాహనాల్లో రైతులు తీసుకువచ్చారు. ధరలు కనిష్టంగా రూ. 5,500 నుండి గరిష్టంగా రూ. 6,400 వరకు పలికాయి. * కాటన్ బ్యాగులు: 43 క్వింటాళ్ల పత్తిని 28 మంది రైతులు మార్కెట్కు తీసుకురాగా, ధరలు కనిష్టంగా రూ. 5,500 నుండి […]
జమ్మికుంట (హుజూరాబాద్), అక్టోబర్ 12, 2025:ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు సూచనల మేరకు జమ్మికుంటలో బ్లాక్ కాంగ్రెస్, పట్టణ మండల కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో “ఓట్ చోర్” కార్యక్రమం నిర్వహించారు.దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఓట్లను అక్రమంగా తొలగిస్తూ ‘చోర్’ చేస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై తమ నాయకులు రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో భారత ఎన్నికల సంఘానికి (ఈసీ) పలుమార్లు […]