పత్తి రైతుల పోరుబాట: రాష్ట్ర కో కన్వీనర్‌గా చెల్పూరి రాము ఎన్నిక; సీసీఐపై ఆందోళనకు పిలుపు!

జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: జనగామలో సెప్టెంబర్ 26న జరిగిన పత్తి రైతుల రాష్ట్ర సదస్సులో కరీంనగర్ జిల్లాకు చెందిన చెల్పూరి రాము రెండోసారి రాష్ట్ర కో కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.
ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ, తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. ముఖ్యంగా, సీసీఐ (CCI) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, క్వింటాల్ పత్తికి రూ. 10,075 ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ‘కాపాస్ కిసాన్ యాప్’ అమలును వెనక్కి తీసుకోవాలని, తేమశాతంతో సంబంధం లేకుండా సీసీఐ కొనుగోలు చేయాలని తెలిపారు.
రైతు వ్యతిరేక విధానాలపై పోరాట కార్యాచరణను ప్రకటించారు. తడిసిన పత్తికి నష్టపరిహారం కోరుతూ పంటల సందర్శన యాత్రలు, నవంబర్ 10న వరంగల్‌లో, నవంబర్ 17న ఆదిలాబాద్‌లో సీసీఐ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos