Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.
జమ్మికుంట: జమ్మికుంట-పెద్దపల్లి ప్రధాన రోడ్డుపై నాగంపేట కూడలి వద్ద ఏర్పడిన గుంతను తనుగుల సెక్షన్ విద్యుత్ ఉద్యోగులు పూడ్చి సామాజిక స్పృహ చాటుకున్నారు. వర్షాలకు ఏర్పడిన ఈ పెద్ద గుంతతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. బేకరీ యజమాని రవి విజ్ఞప్తి మేరకు, బిజిగిరి షరీఫ్ లైన్ మెన్ విజ్జిగిరి అంజయ్య, ఏఎల్ఎం రమేష్ బాబు, సతీష్ సహా ఇతర ఉద్యోగులు లంచ్ సమయంలో కంకర, సిమెంట్తో గుంతను పూడ్చివేశారు. వీరి సేవను స్థానికులు, వాహనదారులు హర్షించారు.
జమ్మికుంట: రైస్ మిల్ ఆపరేటర్లకు కనీస వేతనంగా రూ. 26,000 చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సదుపాయాలను హమాలీ, వాచ్మెన్ వంటి అన్ని రకాల కార్మికులకు అమలు చేయాలని ఆయన కోరారు.యజమాన్యాలు కనీస వేతనంపై కాకుండా ఇష్టానుసారం పీఎఫ్ చెల్లిస్తున్నాయని, పాత కార్మికులకు భద్రత లేకుండా చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. బీహార్ వలస కార్మికుల చట్టాన్ని కఠినంగా అమలు చేసి, వారి శ్రమ దోపిడీని […]
జమ్మికుంట: వరల్డ్ డయాబెటిస్ డే (ప్రపంచ మధుమేహ దినోత్సవం) సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఆధ్వర్యంలో ఈ నెల 14న జమ్మికుంటలో 2కే రన్ నిర్వహించనున్నారు.డయాబెటిస్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. * ఎప్పుడు: నవంబర్ 14న * ఎక్కడ: జమ్మికుంట * రన్ మార్గం: అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రభుత్వ కళాశాల మైదానం వరకు ఈ 2కే రన్ కొనసాగుతుంది. ఈ […]
జమ్మికుంట: మంగళవారం, 11 నవంబర్, 2025 న న్యూ విజన్ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.నూతన కమిటీ అధ్యక్షుడిగా పాస్టర్ జాన్, ఉపాధ్యక్షుడిగా డేవిడ్ పాస్టర్ ఎన్నికయ్యారు. పాస్టర్ జ్యోతి బాబు జనరల్ సెక్రటరీగా, పాస్టర్ సువార్త రాజు జాయింట్ సెక్రటరీగా, పాస్టర్ టైటస్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.పాస్టర్ అశోక్ గౌరవ అధ్యక్షులుగా, పాస్టర్ ప్రసాద్ ముఖ్య సలహాదారులుగా వ్యవహరించనున్నారు. కార్యవర్గ సభ్యులుగా పాస్టర్ సైఫెన్, పాస్టర్ రాజేందర్ ఎన్నికయ్యారు.
జమ్మికుంట మండల కేంద్రంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కోశాధికారి లద్దునురి విష్ణు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.జమ్మికుంట బాలికల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, గురుకుల పాఠశాలలకు, శిథిలావస్థలో […]
జమ్మికుంట: మైనారిటీ వెల్ఫేర్ డే నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా జమ్మికుంట( ఇందిరానగర్)కు చెందిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ 1 పాఠశాలలో మంగళవారం రోజున మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, జన్మదినం రోజును పురస్కరించుకొని నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషనల్ డే ను ఘనంగా ప్రిన్సిపల్ నాధియా ఫర్నాజ్, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య కళలతో ఆటపాటలతో పలువురిని ఆలకించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద […]
జమ్మికుంట: మండలంలోని రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో అన్నదాతలను నిలువునా దోపిడీ చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, మిల్లర్లు ప్రతి క్వింటాల్కు 5 నుండి 8 కిలోలు అదనంగా కాటా వేస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లపై వెంటనే విజిలెన్స్ తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఐకేపీ సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, […]
జమ్మికుంట పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ఆవరణలో శ్రీ గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం ఘనంగా మొదలయ్యాయి. బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి పర్యవేక్షణలో అర్చక బృందం వేదమంత్రాల మధ్య సుప్రభాతం, గోపూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ సహా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చిట్టోజు రజిత శ్రీనివాస్ దంపతులు మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకార రమేష్, జూపాక శ్రీనివాస్, సూరాచారిలతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం […]
స్థానిక జమ్మికుంట గాంధీ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణ, మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి, టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేసి, ప్రస్తుతం 6 గ్యారంటీలను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మరింత […]
జమ్మికుంట: స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం, పాలకవర్గం కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడర్స్, ఆర్థిదారులు, రైతులు, హమాలీలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.