జమ్మికుంట మైనారిటీ స్కూల్లో ఘనంగా మైనారిటీ వెల్ఫేర్ డే

జమ్మికుంట: మైనారిటీ వెల్ఫేర్ డే నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా జమ్మికుంట( ఇందిరానగర్)కు చెందిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ 1 పాఠశాలలో మంగళవారం రోజున మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, జన్మదినం రోజును పురస్కరించుకొని నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషనల్ డే ను ఘనంగా ప్రిన్సిపల్ నాధియా ఫర్నాజ్, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య కళలతో ఆటపాటలతో పలువురిని ఆలకించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో జిల్లా మరియు రాష్ట్రంలో పథకాలు సాధించిన విద్యార్థులకు విద్యలో మండల టాపర్లకు జిల్లా టాపర్లకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మైనారిటీ నాయకులు, జమ్మికుంట ఖురేషి మజీద్ అధ్యక్షులు ఎండి జాకీర్, ముఫ్తి మాసూం సహాబ్, ఎండి చాంద్, జయభారతి స్కూల్ కరస్పాండెంట్ ప్రతాప్ రెడ్డి,లతోపాటు ఉపాధ్యాయురాల్లు విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact