అక్టోబర్ 18, 2025
జమ్మికుంట: కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి జమ్మికుంటలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ కిడ్నీ స్పెషలిస్ట్ డా. గీతాంజలి నరేష్ ప్రతి ఆదివారం ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జమ్మికుంట నందు రోగులకు అందుబాటులో ఉంటున్నారు.
కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం ఇకపై కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి పెద్ద పట్టణాలకు వెళ్లవలసిన అవసరం లేదని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది. జమ్మికుంటలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని వారు తెలిపారు.
డా. గీతాంజలి నరేష్ ప్రతి ఆదివారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కిడ్నీ సంబంధిత సమస్యలకు చికిత్స అందిస్తారు. ఈ అవకాశాన్ని కిడ్నీ వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.







