మార్చి 8, 2026: పెంచిన వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట గాంధీ చౌక్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో వినూత్న నిరసన చేపట్టారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొప్పుల శంకర్ మాట్లాడుతూ, క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. గృహ వినియోగ సిలిండర్పై రూ.60, కమర్షియల్పై రూ.115 పెంచడం దారుణమన్నారు. మహిళా దినోత్సవం ముందు ధరలు పెంచి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు. గ్యాస్ సబ్సిడీని పునరుద్ధరించి, నిత్యావసరాల ధరలు అదుపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దండిగారి సతీష్, కన్నాము సదానందం, వడ్లూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.








