జమ్మికుంట రైతు ప్రగతి రెండవ వార్షిక సమావేశం

జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు ప్రగతి ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం రెండవ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. రైతు ప్రగతి చైర్మన్ సంద మహేందర్ అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న GNNS-KVK ప్రధాన కార్యదర్శి పరిపాటి విజయ్ గోపాల్ రెడ్డి FPO అవకాశాలపై మాట్లాడారు. స్మార్ట్ కార్డుల ద్వారా రైతులకు ఇన్పుట్ అందించాలని, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా లాభాలు పొందాలని సూచించారు. హుజురాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకులు సునీత మాట్లాడుతూ, రైతులు ఇన్పుట్ తో పాటు అవుట్‌పుట్ బిజినెస్ కూడా చేసి లాభాలు పొందాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్ రబీ సీజన్‌లో ఫర్టిలైజర్ అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. చైర్మన్ సంద మహేందర్ సంఘంలోనే ఇన్పుట్ బిజినెస్ చేసి తక్కువ ధరలకు పొందాలని సభ్యులను కోరారు. ఈ సమావేశంలో సుమారు 280 మంది సభ్యులు పాల్గొన్నారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact