పదవ, ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

జమ్మికుంట: హుజూరాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ శనివారం జమ్మికుంట మండలంలోని 8 జిల్లా పరిషత్ హైస్కూళ్లు, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లను పంపిణీ చేసింది.
ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న 227 మందికి, ఇంటర్మీడియట్ చదువుతున్న 160 మందికి కలిపి మొత్తం 387 పరీక్ష ప్యాడ్‌లను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిహెచ్ లచ్చయ్య, ప్రధానోపాధ్యాయులు బి సురేష్ బాబు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact