పీజి స్పాట్ అడ్మీషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ & పీజి కళాశాల, జమ్మికుంటలో ఖాళీగా ఉన్న M.Sc. జువాలజీ మరియు M.Sc. బోటనీ కోర్సుల్లో ప్రవేశం కోసం స్పాట్ అడ్మీషన్లు నిర్వహించనున్నారు.
ఈ నెల 18వ తేదీ మంగళవారం ఉదయం 10:00 గంటలకు కళాశాలలో ఈ ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తుదారులు CPGET – 2025లో అర్హత పొంది ఉండాలి లేదా డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అడ్మిషన్ పొందిన విద్యార్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్సు ఫీజు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు నిర్ణీత కోర్సు ఫీజుతో పాటు అసలు సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact