Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.
జమ్మికుంట: బీహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి 243 స్థానాలకు గాను సుమారు 206 సీట్లలో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం అనంతరం కొలకాని రాజు మాట్లాడుతూ, దొంగ ఓట్లంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రచారాన్ని బీహార్ ప్రజలు ఓటుతో తిరస్కరించడం చెంపపెట్టు అని ఎద్దేవా […]
జమ్మికుంట: జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ జమ్మికుంట పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొత్తం 22 మంది విద్యార్థులు చిన్న ఉపాధ్యాయులుగా మారి వివిధ తరగతుల్లో పాఠాలు బోధించి తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో నాయకత్వ గుణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందర్నీ అలరించారు. ఈ సమావేశానికి విచ్చేసిన మండల విద్యా అధికారి హేమలత గారు ఉపాధ్యాయులుగా […]
జమ్మికుంట, నవంబర్ 13, 2025: చదువు ప్రతి ఒక్కరి హక్కు అని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భావి భారత పౌరులుగా ఎదగాలని PSK ఫౌండేషన్ వ్యవస్థాపకులు పొనగంటి సాత్విక్ పటేల్ పిలుపునిచ్చారు. పొనగంటి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం మండల ప్రాథమిక పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట టౌన్ ఎస్ఐ సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు […]
జమ్మికుంట: పట్టణంలోని ‘సెరా లైఫ్’ క్లినిక్ను డిప్యూటీ డీఎంహెచ్ఓ, డాక్టర్ చందు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నడుపుతున్నట్లు గుర్తించి, వెంటనే మూసివేయాలని ఆదేశించారు. చట్టపరమైన రిజిస్ట్రేషన్ వచ్చేవరకు క్లినిక్ తెరవకూడదని నిర్వాహకుడికి సూచించారు. ప్రజలు అర్హత గల వైద్యుల వద్దే వైద్యం చేయించుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ తనిఖీలో సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్ రాజు, సిబ్బంది నరేందర్ పాల్గొన్నారు.
వీణవంక మాజీ సింగిల్ విండో చైర్మన్ పెద్ది మల్లారెడ్డి కుమార్తె డా. సుప్రియ – డా. ఆదిత్య కిషోర్ వివాహం బుధవారం కరీంనగర్లోని కొండ సత్యలక్ష్మి గార్డెన్లో జరిగింది. అలాగే, జమ్మికుంట మడిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు పెరవేన రమేశ్ కుమారుడు అఖిల్ – దివ్యల వివాహం జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్లో జరిగింది. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు […]
జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్ కమిటీలో గురువారం (13-11-2025) పత్తి అమ్మకాలు కొనసాగాయి. * విడి పత్తి: 66 వాహనాల్లో 593 క్వింటాళ్ల పత్తి మార్కెట్కు వచ్చింది. ధర క్వింటాల్కు ₹7,000 నుండి ₹6,200 మధ్య పలికింది. * కాటన్ బ్యాగ్లు: 7 మంది రైతులు తీసుకొచ్చిన 18 క్వింటాళ్ల ధర ₹6,200 నుండి ₹5,000 మధ్య నమోదైంది.
జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు ప్రగతి ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం రెండవ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. రైతు ప్రగతి చైర్మన్ సంద మహేందర్ అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న GNNS-KVK ప్రధాన కార్యదర్శి పరిపాటి విజయ్ గోపాల్ రెడ్డి FPO అవకాశాలపై మాట్లాడారు. స్మార్ట్ కార్డుల ద్వారా రైతులకు ఇన్పుట్ అందించాలని, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా లాభాలు పొందాలని సూచించారు. హుజురాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకులు సునీత మాట్లాడుతూ, రైతులు ఇన్పుట్ […]
నవంబర్ 17న వైభవంగా కార్తీక దీపోత్సవం జమ్మికుంట పట్టణంలో శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (బొమ్మల గుడి) నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నవంబర్ 17, 2025 సోమవారం సాయంత్రం 6 గంటల నుండి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా శివరామకృష్ణ ఆశ్రమ బృందం, అంజలి డ్యాన్స్ అకాడమీ, శ్రీకృష్ణ అకాడమీచే కూచిపూడి నాట్యం, చక్కభజనతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. హిందూ ధర్మ ప్రచారకులు స్వామి లక్షణాచార్య ప్రవచనం, పురోహితులచే […]
జమ్మికుంట: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టి.పి.టి.ఎఫ్) సీనియర్ నాయకులు కోల రాజమల్లు ఆధ్వర్యంలో జమ్మికుంట మండలంలోని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను సేకరించారు.పెండింగ్లో ఉన్న ఐదు డి.ఏ.లు, నాణ్యమైన పి.ఆర్.సి.ని వెంటనే ప్రకటించాలని ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జి.పి.ఎఫ్., సరెండర్ లీవ్స్, ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఉపాధ్యాయులను బోధనకు అంకితం చేసే విధంగా విధానాలు ఉండాలని, పర్యవేక్షణ పేరుతో ఒత్తిడి పెంచవద్దని […]
జమ్మికుంట: జమ్మికుంట-పెద్దపల్లి ప్రధాన రోడ్డుపై నాగంపేట కూడలి వద్ద ఏర్పడిన గుంతను తనుగుల సెక్షన్ విద్యుత్ ఉద్యోగులు పూడ్చి సామాజిక స్పృహ చాటుకున్నారు. వర్షాలకు ఏర్పడిన ఈ పెద్ద గుంతతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. బేకరీ యజమాని రవి విజ్ఞప్తి మేరకు, బిజిగిరి షరీఫ్ లైన్ మెన్ విజ్జిగిరి అంజయ్య, ఏఎల్ఎం రమేష్ బాబు, సతీష్ సహా ఇతర ఉద్యోగులు లంచ్ సమయంలో కంకర, సిమెంట్తో గుంతను పూడ్చివేశారు. వీరి సేవను స్థానికులు, వాహనదారులు హర్షించారు.