Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.
జమ్మికుంట: తెలంగాణ అయ్యప్ప సేవర్థి ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షులు సిరిమల్లె జయేందర్ గురు స్వామి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు వాకాటి భాస్కరరావు జయేందర్ సేవలను గుర్తించి ఉపాధ్యక్షులుగా నియమించినారు 2026-2028 రెండు సంవత్సరాల కాలానికి గాను రెండవసారి ఉపాధ్యక్ష పదవి వరించడం పట్ల జమ్మికుంట అయ్యప్ప స్వాములు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం అయ్యప్ప దేవాలయంలో స్వామి ఎదుట ప్రమాణ స్వీకారం […]
జమ్మికుంట: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్, తమ జమ్మికుంట ఆఫీస్ పరిధిలో సిమ్ సేల్స్ ప్రమోటర్స్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం.ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. స్త్రీ, పురుషులు ఎవరైనా అర్హులు. ముఖ్యంగా, ఉద్యోగ స్థానం అభ్యర్థులకు దగ్గరలోని ప్రాంతాల్లోనే లభిస్తుంది. * పోస్టులు: సిమ్ సేల్స్ ప్రమోటర్స్ * వయో పరిమితి: 18 నుండి 35 సంవత్సరాలు * […]
జమ్మికుంట, నవంబర్ 22: కార్మిక హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్ ల అమలు నోటిఫికేషన్ ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. శనివారం జమ్మికుంట గాంధీ చౌరస్తాలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే కేంద్రం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. బీహార్ ఎన్నికల అనంతరం కార్మికులపై భారం మోపుతున్నారని విమర్శించారు. కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని […]
జమ్మికుంట: స్థానిక వ్యవసాయ మార్కెట్ బుధవారం నాడు పత్తి ధరలు. 351 క్వింటాళ్ల విడి పత్తి మార్కెట్కు రాగా, దాని గరిష్ట ధర క్వింటాలుకు ₹7,090, కనిష్ట ధర ₹6,000 గా ఉంది. కాటన్ బ్యాగ్ల గరిష్ట ధర ₹6,600. నవంబర్ 20, గురువారం అమావాస్య సందర్భంగా మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు. తిరిగి నవంబర్ 21, శుక్రవారం మార్కెట్ తెరుచుకోనుంది.
జమ్మికుంట: మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు సాయం చేశారన్నారు. ప్రపంచ దేశాలు సైతం ఆమెకు ‘ఉక్కు మహిళ’ అనే బిరుదును ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె పేరుతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి […]
జమ్మికుంట: బీసీ హక్కులు బీసీలకే దక్కాలి, బీసీ రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కే” అనే నినాదంతో మానవ హక్కుల వేదిక (HRF) ఆధ్వర్యంలో రేపు (నవంబర్ 20, బుధవారం) ఇందిరానగర్ లోని దినేష్ కన్వెన్షన్ హాల్లో భారీ బీసీ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు మద్దతుగా, దూదేకుల నూర్భాష జమ్మికుంట మండల అధ్యక్షుడు మహమ్మద్ బందే అలీ ఆధ్వర్యంలో ఈ రోజు పోస్టర్ను ఆవిష్కరించారు. గుల్జార్ మస్జిద్ (జామ మస్జిద్) అధ్యక్షుడు హుస్సేన్ ఈ పోస్టర్ను ఆవిష్కరించారు.మహమ్మద్ బందే […]
జమ్మికుంట: ప్రపంచ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా, జమ్మికుంటలోని అమృత న్యూరో హాస్పిటల్కు చెందిన డాక్టర్ కందికొండ రాజేందర్ (DM న్యూరాలజిస్ట్) మూర్ఛ వ్యాధి (Epilepsy) గురించి సమాజంలో ఉన్న అపోహలను తొలగిస్తూ, సరైన చికిత్స ప్రాముఖ్యతపై సందేశం ఇచ్చారు.డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ, మూర్ఛ అనేది అన్ని వయసుల వారికీ రావొచ్చని, దీనికి కారణాలు కూడా పలు రకాలుగా ఉంటాయని వివరించారు. చిన్నపిల్లలలో అధిక జ్వరం, మెదడులో నిర్మాణ సంబంధిత సమస్యలు లేదా జన్యుపరమైన కారణాల వల్ల […]
జమ్మికుంట: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు స్కీమ్లు, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతుల రద్దుతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జమ్మికుంట CITU మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.CITU జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల కోసం జమ్మికుంట పట్టణంలో ప్రత్యేక అడ్డా స్థలం కేటాయించాలని, అక్కడ మంచినీరు, టాయిలెట్స్ వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సంక్షేమ బోర్డు […]
జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ & పీజి కళాశాల, జమ్మికుంటలో ఖాళీగా ఉన్న M.Sc. జువాలజీ మరియు M.Sc. బోటనీ కోర్సుల్లో ప్రవేశం కోసం స్పాట్ అడ్మీషన్లు నిర్వహించనున్నారు.ఈ నెల 18వ తేదీ మంగళవారం ఉదయం 10:00 గంటలకు కళాశాలలో ఈ ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తుదారులు CPGET – 2025లో అర్హత పొంది ఉండాలి లేదా డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అడ్మిషన్ పొందిన విద్యార్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్సు ఫీజు మొత్తాన్ని చెల్లించాల్సి […]
జమ్మికుంట: హుజూరాబాద్కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ శనివారం జమ్మికుంట మండలంలోని 8 జిల్లా పరిషత్ హైస్కూళ్లు, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేసింది.ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న 227 మందికి, ఇంటర్మీడియట్ చదువుతున్న 160 మందికి కలిపి మొత్తం 387 పరీక్ష ప్యాడ్లను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ చేతుల మీదుగా జరిగింది. ఈ […]