ఇల్లందకుంట: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా, ఇల్లందకుంట మండలంలో కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం భారీ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.
హుజూరాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకొని, బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యూహం, సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు పట్టం కట్టారని, తప్పుడు ప్రచారాలు చేసిన బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పారని నాయకులు మండిపడ్డారు. తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీదే విజయమని శపథం చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







