హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు పౌరులకు కీలకమైన మీ-సేవ సేవలను వాట్సాప్లో ప్రారంభించారు. మెటా భాగస్వామ్యంతో అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయం ద్వారా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సేవలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు తమ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, పోస్ట్-గ్రాడ్యుయేషన్, ఇతర పోటీ పరీక్షల హాల్ టిక్కెట్లను సులభంగా డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించారు.
ఈ సేవ 24 గంటలు 8096958096 నంబర్పై అందుబాటులో ఉంటుంది. త్వరలోనే ఈ సేవలను తెలుగు, ఉర్దూ భాషల్లోనూ, వాయిస్ కమాండ్తోనూ విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏటా 10 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.







