బీజేపీ నాయకులపై పోలీస్ లకు పిర్యాదు

జమ్మికుంట/హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) నాయకులు మంగళవారం, అక్టోబర్ 14, 2025న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్, మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావులు మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని వారు తీవ్రంగా హెచ్చరించారు.
ప్రజల్లో ఎమ్మెల్యేకు ఉన్న ఆదరణ, ప్రజాదరణను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు ఇలాంటి నిరాధారమైన విమర్శలు చేస్తున్నారని వారు ఆరోపించారు. మరోసారి తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, ఇలాంటి వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) శ్రేణులు, ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు.
ఈ ఫిర్యాదు కార్యక్రమంలో చిలుముల రామస్వామి, ఎండి జానీ, మొలుగూరి వసంత్, మంద రాజేష్, జే కే పొనగంటి శ్రీధర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact