జమ్మికుంట: మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) సామాజిక సేవా రంగంలో ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అదేవిధంగా, ఆయన కూతురు అక్షిత 2024-25 విద్యా సంవత్సరంలో నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీటు సాధించింది.
ఈ సందర్భంగా, సెరెనిటి టౌన్ షిప్ జనగామ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ నెహ్రూ దంపతులు గురువారం జమ్మికుంట న్యూ జర్నలిస్ట్ కాలనీలోని తమ నివాసంలో తండ్రీకూతుళ్లు ఇద్దరినీ శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సమాజ సేవకుడిగా, చిత్రకారునిగా, క్రీడాకారునిగా, జర్నలిస్టుగా రాణిస్తూ మానవత్వం ఉన్న మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారని విజయ నెహ్రూ కొనియాడారు. సెరెనిటీ ఫ్యామిలీ సభ్యులు సత్యవేణి, ఉమారాణి, రజిత, సహస్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







