భారీ వర్షాలు: రైతుల పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ కరువైంది! – ఎర్రబెల్లి సంపత్ రావు జమ్మికుంట: రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు నీటమునిగి తీవ్రంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు డిమాండ్ చేశారు.వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు పెట్టుబడులు పెట్టి, అవి చేతికి వచ్చే సమయంలో ఇలా వర్షాలు పడటం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ […]
సత్యనారాయణ రావుకు ప్రముఖుల నివాళిమాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు తండ్రి కీ.శే. తన్నీరు సత్యనారాయణ రావు ఉదయం మరణించారు. హైదరాబాద్లో వారి అంతిమయాత్రలో జమ్మికుంట ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీరితో పాటు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్, బీఆర్ఎస్ […]
జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామ ప్రజలు, నాయకులు పలు సమస్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి సానుకూలంగా హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు, రాములు, రాకేష్, రాజు, అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు.
వీణవంక (అక్టోబర్ 28, 2025): మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, YuppTV & Turito వ్యవస్థాపక, CEO పాడి ఉదయ్ నందన్ రెడ్డి వీణవంకలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దాసారపు ప్రభాకర్, మాజీ సర్పంచ్ గంగారెడ్డి తిరుపతిరెడ్డి, మేకల సమ్మిరెడ్డి, అమృత ప్రభాకర్, తాళ్లపెల్లి కుమారస్వామి, తోట్ల రాకేష్, సిరిగిరి రాజశేఖర్, పస్తం కుమార్ స్వామి, దాసరపు […]
జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: BRSV రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు, జమ్మికుంట మండల అధ్యక్షుడు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో ‘హలో విద్యార్థి చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని పలు విద్యాసంస్థల విద్యార్థులతో BRSV నాయకులు మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, రూ. 8000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకంగా మారిందని నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ […]
జమ్మికుంట: తెలంగాణ ప్రభుత్వం దూదేకుల, నూర్ భాష మరియు ఫకీర్ కులాలకు మొపేడ్ వాహనాలు (ఎలక్ట్రిక్ టూ వీలర్లు), వితంతు/ఒంటరి మహిళలకు రూ.50,000/- అందించే పథకాలను ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసింది. ఈ పథకాలకు చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. ఎన్నికలు వాయిదా పడినందున, దరఖాస్తు గడువును తిరిగి పొడిగించాలని మైనారిటీ సీనియర్ నాయకులు ఎం.డి గౌసోద్దీన్, ఎం.డి అంకూషా, యాకుబ్, సలీం తదితరులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ పథకాలు పేద మైనారిటీల జీవనోపాధికి కీలకం.
హైదరాబాద్/ జమ్మికుంట: ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా రక్షణ చట్టాలు కల్పించాలని బీసీ ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు మహమ్మద్ యూసుఫ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా పార్కు వద్ద జరిగిన మహా ధర్నాలో ఆయన మాట్లాడారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధనకై బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. స్థానిక సంస్థల్లో ఉపవర్గీకరణతో రిజర్వేషన్, బడ్జెట్ల తక్షణ విడుదల, నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం నియామకం చేయాలని […]
జమ్మికుంట: జమ్మికుంట నుండి వావిలాల వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డులో చిన్నకోమిటిపల్లి నుండి నాగంపేట మధ్యభాగంలో ఏర్పడిన గుంతల కారణంగా రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కాంట్రాక్టర్ తోట లక్ష్మణ్ (గండ్రపల్లి), జేసీబీ సహాయంతో రహదారిలోని గుంతలను మోరంతో పూడ్చే పనులు ప్రారంభించారు.ఈ మరమ్మత్తుల కార్యక్రమంలో శ్యాంపేట్ మాజీ సర్పంచ్ దేవేందర్ రావు, నాగంపేట మాజీ సర్పంచ్ చిన్న కృష్ణా రెడ్డి, అలాగే ఉపాధ్యాయుడు చంద్రమోహన్ పాల్గొన్నారు.
జమ్మికుంట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేంతవరకు పోరాటం ఆగదని బీసీ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బేట రవీందర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరి రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు ఏ బూసి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జమ్మికుంటలోని చాణక్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన జమ్మికుంట బంద్ స్వచ్ఛందంగా, సంపూర్ణంగా జరిగిందని తెలిపారు. ఈ బంద్కు […]
కరీంనగర్ జిల్లా (అక్టోబర్ 18, 2025): కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై అభిప్రాయ సేకరణహుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కరీంనగర్లో ఏఐసీసీ పరిశీలకులు మానే శ్రీనివాస్, పీసీసీ ప్రతినిధులు, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణను మర్యాదపూర్వకంగా కలిశారు.కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి అభిప్రాయ సేకరణ నిమిత్తం ఏఐసీసీ పరిశీలకులు, పీసీసీ ప్రతినిధులు కరీంనగర్కు విచ్చేసిన సందర్భంగా ఈ భేటీ జరిగింది. జిల్లా […]