ఇల్లందకుంట: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించాలనే డిమాండ్తో కరీంనగర్ జిల్లాకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా నిరసన చేసే అవకాశం ఉందని బీసీ సంక్షేమ సంఘం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఇల్లంతకుంట మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోత్కూరు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి జంపాల రితీష్ సహా ఉపాధ్యక్షులు తోడేటి మధుకర్ గౌడ్, కారింగుల రాజేందర్, కోశాధికారి చింతల కౌశిక్, మురహరి రాజు, మేకల తిరుపతి, నల్లగొండ రాజు, […]
మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రేపు (నవంబర్ 06, 2025) హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఉదయం 11:00 గంటలకు, కమలాపూర్ మండల కేంద్రంలోని రావిచెట్టు వద్ద (ఈటల నివాసం సమీపంలో) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏర్పాటు చేసిన భారీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ వివరాలను ఎంపీ ఈటల రాజేందర్ పి.ఎ. నరేందర్ తెలిపారు.
జమ్మికుంట: హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన న్యాయవాది నుతాల శ్రీనివాస్ను బీజేపీ నాయకులు జమ్మికుంటలోని ఆయన స్వగృహంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడారు. న్యాయ వృత్తిలో పేద, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడే మంచి పేరు శ్రీనివాస్కు ఉందని కొనియాడారు. చదువుకునే రోజుల్లో ఏబీవీపీలో పనిచేసి, బీజేపీ పటిష్టతకు కూడా […]
జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పుట్టినరోజు వేడుకలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సలీం పాషా ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ చౌరస్తాలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు భారీగా బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం, జమ్మికుంట శివాలయంలో మహా అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ […]
హుజూరాబాద్: పేదవారి పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. చెక్కుల పంపిణీలో జాప్యం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. శనివారం, కాంగ్రెస్ కార్యాలయంలో రూ. 47,62,000/- విలువ గల 135 ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ప్రణవ్ స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులు ఈ చెక్కులను అందుకున్నారు. పేదలకు అండగా ఉండటం తమ కర్తవ్యమని ప్రణవ్ పేర్కొన్నారు. లబ్ధిదారులు […]
భారీ వర్షాలు: రైతుల పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ కరువైంది! – ఎర్రబెల్లి సంపత్ రావు జమ్మికుంట: రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు నీటమునిగి తీవ్రంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు డిమాండ్ చేశారు.వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు పెట్టుబడులు పెట్టి, అవి చేతికి వచ్చే సమయంలో ఇలా వర్షాలు పడటం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ […]
సత్యనారాయణ రావుకు ప్రముఖుల నివాళిమాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు తండ్రి కీ.శే. తన్నీరు సత్యనారాయణ రావు ఉదయం మరణించారు. హైదరాబాద్లో వారి అంతిమయాత్రలో జమ్మికుంట ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీరితో పాటు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్, బీఆర్ఎస్ […]
జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామ ప్రజలు, నాయకులు పలు సమస్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి సానుకూలంగా హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు, రాములు, రాకేష్, రాజు, అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు.
వీణవంక (అక్టోబర్ 28, 2025): మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, YuppTV & Turito వ్యవస్థాపక, CEO పాడి ఉదయ్ నందన్ రెడ్డి వీణవంకలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దాసారపు ప్రభాకర్, మాజీ సర్పంచ్ గంగారెడ్డి తిరుపతిరెడ్డి, మేకల సమ్మిరెడ్డి, అమృత ప్రభాకర్, తాళ్లపెల్లి కుమారస్వామి, తోట్ల రాకేష్, సిరిగిరి రాజశేఖర్, పస్తం కుమార్ స్వామి, దాసరపు […]
జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: BRSV రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు, జమ్మికుంట మండల అధ్యక్షుడు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో ‘హలో విద్యార్థి చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని పలు విద్యాసంస్థల విద్యార్థులతో BRSV నాయకులు మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, రూ. 8000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకంగా మారిందని నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ […]