ఇల్లందకుంట: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా, ఇల్లందకుంట మండలంలో కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం భారీ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.హుజూరాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకొని, బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యూహం, సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, […]
హైదరాబాద్: మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అజారుద్దీన్ను నూర్ భాషా (A, B, E) గ్రూపుల తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు జమ్మికుంటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ యూసఫ్ శుక్రవారం హైదరాబాద్లో కలిశారు. అఫ్జల్గంజ్లోని సెంట్రల్ లైబ్రరీ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి దృష్టికి, నూర్ భాషా కులస్తులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలను యూసఫ్ తీసుకెళ్లారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ […]
జమ్మికుంట: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) హుజురాబాద్, జమ్మికుంట శాఖలు సంయుక్తంగా ఒక 2K రన్ అవగాహన ర్యాలీని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో వైద్యులు, స్థానిక ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జీవనశైలి మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చనే సందేశాన్ని ఈ ర్యాలీ ద్వారా విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
జమ్మికుంట: తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుపై కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మేనిఫెస్టో హామీల ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారనడానికి ఈ విజయమే నిదర్శనమని ఆయన అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సదయ్య ధీమా వ్యక్తం చేశారు.
ఇల్లందకుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, ఇల్లందకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జరిగాయి.నాయకులు మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్యం, పురోభివృద్ధిలో నెహ్రూ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన గొప్ప నాయకుడు, రచయిత మరియు రాజనీతిజ్ఞుడని కొనియాడారు. పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమకు చిహ్నంగానే నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. నెహ్రూ ఆశయాల స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ […]
జమ్మికుంట: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.టపాసులు కాల్చి, స్వీట్లు పంచుతూ, సౌండ్ బాక్సుల నడుమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పార్టీ పెద్దలందరికీ, జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిని చూసే ప్రజలు నవీన్ యాదవ్ను గెలిపించారని, రానున్న స్థానిక […]
జమ్మికుంట ప్రాథమిక సహకార సంఘంలో 72వ సహకార సంఘాల వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 14 నుండి 20 వరకు జరిగే ఈ వారోత్సవాలలో భాగంగా సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల మాజీ చైర్మన్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జమ్మికుంట: మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) సామాజిక సేవా రంగంలో ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అదేవిధంగా, ఆయన కూతురు అక్షిత 2024-25 విద్యా సంవత్సరంలో నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీటు సాధించింది.ఈ సందర్భంగా, సెరెనిటి టౌన్ షిప్ జనగామ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ నెహ్రూ దంపతులు గురువారం జమ్మికుంట న్యూ జర్నలిస్ట్ కాలనీలోని తమ నివాసంలో తండ్రీకూతుళ్లు ఇద్దరినీ శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, […]
జమ్మికుంట, నవంబర్ 13, 2025: చదువు ప్రతి ఒక్కరి హక్కు అని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భావి భారత పౌరులుగా ఎదగాలని PSK ఫౌండేషన్ వ్యవస్థాపకులు పొనగంటి సాత్విక్ పటేల్ పిలుపునిచ్చారు. పొనగంటి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం మండల ప్రాథమిక పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట టౌన్ ఎస్ఐ సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు […]
కరీంనగర్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు ఒక ప్రకటనలో తెలిపారు. * సంస్థ: కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్ (KALYAN JEWELLERS INDIA LTD). * ఖాళీలు: సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ట్రైనీ, ఫ్లోర్ హోస్టెస్, సూపర్వైజర్, ఆఫీస్ బాయ్ వంటి 60 పోస్టులు ఉన్నాయి. * అర్హత: […]