BRS పార్టీ మండలాల కార్యకర్తల సమావేశం – స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం! 🗓 తేదీ: 05-10-2025 🔹 ఇల్లంతకుంట మండలం⏰ సమయం: ఉదయం 10:00 గంటలకు📍 స్థలం: లక్ష్మీనరసింహస్వామికల్యాణ మండపం (చిన్న కోమటిపల్లి గుట్ట ) 🔹 జమ్మికుంట మండలం⏰ సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు📍 స్థలం: MPR గార్డెన్ (జమ్మికుంట) సమావేశాని కి BRS పార్టీ కార్యకర్తలు KCR అభిమానులు అందరూ పాల్గొనాలని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి పిలుపు.
వావిలాల గ్రామంలో తల్లి దుర్గామాతను దర్శించుకున్న జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం. వేలంపాటలో గెలుపొందిన భక్తులకు వస్త్రాలు అందించారు. తదనంతరం దుర్గామాత కమిటీ సభ్యులు చైర్ పర్సన్ కు అమ్మవారి శాలువ కప్పి ఆశీర్వదించారు. ఈ అవకాశం కల్పించిన దుర్గామాత కమిటీ సభ్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు.
అర్హతలు:- 1. సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి కచ్చితంగా గ్రామపంచాయతీలో స్థానికుడై ఉండాలి. 2. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి. 3. సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 4. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది. 5. మహిళలకు […]
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర బిసి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్
జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామానికి చెందిన రాసపల్లి శ్రావణ్కుమార్ ప్రమాదవశాత్తూ మైనింగ్ యాక్సిడెంట్లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు స్మారకార్థం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం రాచపల్లి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక స్పందన అనాధాశ్రమం లోని పిల్లలకు బ్రెడ్, అరటిపండ్లు, కారా వంటి ఆహారపదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ – “శ్రావణ్కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన స్మృతిని ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాల రూపంలో […]
తేదీ 30-9-2025 మంగళవారం జమ్మికుంట: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క 84వ సాధారణ సర్వసభ సమావేశము అధ్యక్షులు పొనగంటి సంపత్ అధ్యక్షతన ఉ. 11 గం.లకు నిర్వహించారు. అధ్యక్షులు సంపత్ మాట్లాడుతూ మన సంఘం ఈరోజు అభివృద్ధి బాటలో ఉండటానికి కారణం సంఘ సభ్యులు మరియు రైతులు తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించడం వల్లే అని, ప్రభుత్వం ఇస్తున్న 3% వడ్డీ రాయితీ రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు.సమావేశానికి సంఘం ఉపాధ్యక్షులు మామిడి తిరుపతి రెడ్డి, మురుపాయల […]
అధైర్య పడకండి అండగా ఉంటా లబ్ధిదారులందరికీ వెంటనే దళిత బంధు ఇవ్వాలి – హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బందు రెండో విడత రాలేదని ఎవరూ అధైర్యపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని, దళితులందరికీ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం దళిత బంధు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంద్ పథకాన్ని తెలంగాణ తొలి […]
భాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం ఆబాది జమ్మికుంట కు చెందిన మాగంటి శ్రీనివాస్ అనే గ్రామీణ వైద్యుడు గుండె పోటుతో మరణించడంతో ఆ కుటుంబానికి గ్రామీణ వైద్యుల మిత్ర బృందం పది వేల ఆర్థిక సహాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య వసతులు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి కి వినతి పత్రాన్ని అందజేసిన నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ప్రభు హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో మంగళ వారం మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చా అందజేసీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మధ్యాహ్నం భోజనం , మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ ప్రభు మాట్లాడుతూ రాష్ట్రంలో […]
జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో శనివారం రోజున గురుకుల పాఠశాలల వ్యవస్థాపకులు ఐఏఎస్ ఎస్.ఆర్ శంకరన్, ఆదివాసి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొమురం జయంతి వేడుకలు దళిత రత్న అవార్డు గ్రహీత టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ 1984లో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ […]