హైదరాబాద్ – రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ముఖ్యమైన తేదీలు ఓటర్ల వివరాలు ఈ ఎన్నికల్లో మొత్తంగా 52.43 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా నమోదైన బోగస్ ఓట్లను వెంటనే తొలగించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సజ్జు ఆధ్వర్యంలో తహసిల్దార్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్లను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.కొందరు నాయకులు మున్సిపాలిటీతో సంబంధం లేని వ్యక్తులకు ఇళ్లతో సంబంధం లేకుండా నెంబర్లు కేటాయించి, దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని వారు ఆరోపించారు. అధికారులు తక్షణమే సమగ్ర […]