జమ్మికుంట: బిజిగిరి షరీఫ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 పదవ తరగతి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా తమకు సేవలు అందించిన గురువులు రాజిరెడ్డి, లక్ష్మీపతి, నాగభూషణాచారి, చంద్రమోహన్, రావుల రాజేశంతో పాటు విద్యాభిమాని డాక్టర్ జగదీశ్వర్ను పూర్వవిద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రవి, సమ్మయ్య, సంపత్, రంగు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.